← Back to news

జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇస్తాం : కాంగ్రెస్ నేత ప్రణవ్

By Srikanth· 24 Aug 2026· కరీంనగర్
జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇస్తాం : కాంగ్రెస్ నేత ప్రణవ్

TG : కరీంనగర్ జిల్లాలో జర్నలిస్టులకు తగిన గౌరవం ఇస్తామని, అర్హులైన ప్రతి విలేకరికి ఇళ్ల పట్టాలు అందేలా చూస్తామని హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్ చెప్పారు. హుజూరాబాద్ అంబేద్కర్ సెంటర్‌లో జర్నలిస్టులు చేస్తున్న రిలే నిరాహార దీక్షల దగ్గరకు వెళ్లి, వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. గతంలో ఇచ్చిన పట్టాల్లో ఉన్న చట్టపరమైన సమస్యలను తీర్చి జర్నలిస్టులకు న్యాయం చేస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇస్తాం : కాంగ్రెస్ నేత ప్రణవ్

More in Local