ఆగస్టు 3 వరకు క్షేత్రస్థాయిలో పనిచేయాలి

TG: SIR ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించిన నేపథ్యంలో CM రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పెరిగిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆగస్టు 3 వరకు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. ఫారాల స్వీకరణ పూర్తయ్యే వరకు నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల కోసం ఎవరూ గాంధీ భవన్కు రావొద్దని స్పష్టం చేశారు. సర్ ప్రక్రియపై జరిగిన వర్చువల్ సమీక్షలో 25 నియోజకవర్గాల పనితీరుపై CM అసంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగు నియోజకవర్గాల్లో అసలు పని జరగలేదని పేర్కొన్నారు. పనితీరు మెరుగుపరచని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



