← Back to news

ఏసీబీ ట్రాప్.. రూ.30 వేల లంచంతో బీట్ ఆఫీసర్ రెడ్ హ్యాండ్!

By samson· 1d ago
ఏసీబీ ట్రాప్.. రూ.30 వేల లంచంతో బీట్ ఆఫీసర్ రెడ్ హ్యాండ్!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం రామానుజగూడెంలో అటవీశాఖ బీట్ ఆఫీసర్ బానోత్ రవికుమార్.. పోడు భూమిలో ట్రెంచ్ వేయకుండా ఉండేందుకు రైతు దగ్గర రూ.30 వేలు డిమాండ్ చేశాడు. మధ్యవర్తి సాదిక్ ద్వారా డబ్బులు తీసుకుంటుండగా ఖమ్మం రేంజ్ ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇది ఈ ఏడాది జిల్లాలో అటవీశాఖలో నాలుగో అవినీతి కేసు. నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 40m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.