ఏసీబీ ట్రాప్.. రూ.30 వేల లంచంతో బీట్ ఆఫీసర్ రెడ్ హ్యాండ్!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం రామానుజగూడెంలో అటవీశాఖ బీట్ ఆఫీసర్ బానోత్ రవికుమార్.. పోడు భూమిలో ట్రెంచ్ వేయకుండా ఉండేందుకు రైతు దగ్గర రూ.30 వేలు డిమాండ్ చేశాడు. మధ్యవర్తి సాదిక్ ద్వారా డబ్బులు తీసుకుంటుండగా ఖమ్మం రేంజ్ ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇది ఈ ఏడాది జిల్లాలో అటవీశాఖలో నాలుగో అవినీతి కేసు. నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



