← Back to news

త్రిబుల్ ఐటీ ఫలితాల్లో సత్తాచాటిన విద్యార్థినులు

By DK· 14 Jun 2026· Hmtvlive· ప్రకాశం జిల్లా
త్రిబుల్ ఐటీ ఫలితాల్లో సత్తాచాటిన విద్యార్థినులు

AP: త్రిబుల్ ఐటీ ఫలితాలలో ప్రకాశం జిల్లా సింగరాయకొండ ZP బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు సత్తా చాటారు. ముగ్గురు రాజీవ్ గాంధీ ట్రిపుల్ ITలలో సీట్లు సాధించారు. పాఠశాలకు చెందిన బీగాల నాగ జ్యోత్స్న నూజివీడు క్యాంపస్‌లో, పొట్టేళ్ల రేవతి ఇడుపులపాయ క్యాంపస్‌లో, పాకల అనూష ఒంగోలు క్యాంపస్‌లో సీట్లు సాధించారు. పాఠశాల HM కే.మహాలక్ష్మి విద్యార్థినులను అభినందించారు. త్రిబుల్ ఐటీల్లో సీట్లు సాధించిన విద్యార్థినులు అక్కడ ఇంటర్మీడియట్‌తో పాటు బీటెక్ కూడా పూర్తి చేసుకుని బయటకు వస్తారని ఆమె చెప్పారు.

More in Education