← Back to news

ఏపీలో నాపై తప్పుడు కేసులు: నటి జిత్వానీ

By Mahesh· 22 Jul 2026
ఏపీలో నాపై తప్పుడు కేసులు: నటి జిత్వానీ

AP: ఏపీలో తనపై, తన కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టారని నటి కాదంబరి జిత్వానీ ఆరోపించారు. సీఐడీ దర్యాప్తు ఏకపక్షంగా సాగిందని, తన వాంగ్మూలాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ఛార్జిషీట్‌లో తనపై అసత్య ఆరోపణలు చేశారని, రూ.4.5 లక్షల డిపాజిట్‌ను రూ.1.32 కోట్లుగా తప్పుగా చూపించారని తెలిపారు. కె.విద్యాసాగర్‌తో ఆర్థిక లావాదేవీలు దశాబ్దం క్రితమే ముగిశాయని క్లారిటీ ఇచ్చారు. తనకు ఎలాంటి రాజకీయ పలుకుబడి లేదని, బలిపశువుగా మార్చి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

More in News