జర్నలిస్టుపై దాడిని ఖండిస్తూ నిరసన ర్యాలీ

AP: విజయనగరం జిల్లా పూసపాటిరేగ విశాలాంధ్ర రిపోర్టర్ గోవిందపై జరిగిన దాడిని ఖండిస్తూ రాజాం ప్రాంతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. రాజాం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా వెళ్లి, అంబేద్కర్ జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే పాత్రికేయులపై దాడులు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.



