రగులుతున్న మణిపూర్, 5 రోజుల బంద్
మణిపూర్లోని బిష్ణుపూర్లో జరిగిన ఘోర బాంబు దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రం ఒక్కసారిగా అట్టుడికిపోయింది. ఈ దారుణానికి నిరసనగా పలు విద్యార్థి సంఘాలు 5 రోజుల పాటు రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. ఇంఫాల్తో పాటు పలు చోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆగ్రహించిన జనం రోడ్లపైకి వచ్చి టైర్లు తగలేస్తూ నిరసన తెలుపుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలను భారీగా మోహరించారు.



