30 ఏళ్లుగా కనిపించని కొడుకు..ఎలా దొరికాడంటే!

AP: పదో తరగతిలో ఫెయిల్ అయ్యాననే భయంతో 1996లో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన రాముడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ముంబై, పూణె, బెంగళూరు నగరాల్లో ఉంటూ అక్కడే కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. ఇటీవల SIR అప్లికేషన్ నింపే సమయంలో తల్లిదండ్రుల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాల్సి రావడంతో సొంత ఊరు గుర్తుకొచ్చింది. 30 ఏళ్ల తర్వాత ఎమ్మిగనూరుకు వచ్చాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇన్నేళ్ల తర్వాత కొడుకు తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఆనందంతో ఉప్పొంగిపోయారు.



