తెలంగాణ లోక్ భవన్ దగ్గర స్టూడెంట్స్ నిరసనలు
TG: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘాలు తెలంగాణ లోక్భవన్ దగ్గర నిరసనలు చేస్తున్నారు. నీట్ పేపర్ లీక్ కారణంగా 21 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జవాబివ్వాలని ఆగ్రహించారు. నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీలతో దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.



