వరదల్లోనూ కూలని ఇల్లు..కారణం ఏంటి?
నేపాల్లోని నువాకోట్ జిల్లా వరదల్లో చాలా ఇళ్లు కొట్టుకుపోయాయి. 40 ఏళ్ల నాటి మింట్-గ్రీన్ రంగు ఇల్లు చెక్కుచెదకుండా ఉంది. ఇంటి లోపల ఆరుగురు పైఅంతస్తులోకి ప్రాణాలు దక్కించుకున్నారు. వారిలో ఒకరైన లక్ష్మీపాండే మీడియాతో మాట్లాడుతూ తను రోజూ హనుమాన్ చాలీసా చదువుతానని, వరద సమయంలో “ఓం నమః శివాయ” జపం చేస్తూ ఉన్నానని చెప్పారు. అదే తమను కాపాడిందని భావిస్తున్నామన్నారు. అయితే బలమైన పునాది ఉండటం, ఫౌండేషన్ను బలపరిచారని నిపుణులు అంటున్నారు. Reinforced కాంక్రీట్ ఫ్రేమ్ వల్లే ఇల్లు సురక్షితంగా ఉందని అంటున్నారు.


