మెట్టూర్ డ్యామ్ నీరు విడుదల చేసిన సీఎం విజయ్
తమిళనాడు సీఎం సి.జోసఫ్ విజయ్ మెట్టూర్ డ్యామ్ నుంచి నీరు విడుదల చేశారు. సాధారణంగా జూన్ 12న ఈ డ్యామ్ తెరుస్తారు. ఈసారి నీళ్లు తక్కువగా ఉండడం వల్ల లేట్ అయింది. నైరుతి రుతుపవనాలు తక్కువగా పడడం, ఎల్ నినో ప్రభావం వల్ల ఇలా జరిగింది. సీఎం విజయ్ మాట్లాడుతూ కావేరీ నీటిపై తమిళనాడుకు ఉన్న హక్కుల విషయంలో రాజీపడం అని చెప్పారు. రైతులు నీటిని జాగ్రత్తగా వాడాలని, మధ్యస్థ కాలం పంటలు వేసుకోవాలని, నీరు ఆదా చేసే పద్ధతులు పాటించాలని కోరారు.



