రోడ్లపై పశువులను వదిలితే చర్యలు తప్పవు..

AP : విజయనగరం జిల్లాలో రాజాం ఏరియా మెయిన్ రోడ్డుపై పశువులను విడిచిపెట్టడం వల్ల ట్రాఫిక్ పెరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. పశువుల యజమానులు తమ పశువులను ఇళ్ల వద్దనే కట్టేయాలని, రోడ్లపైకి వదిలేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్, SI నవీన్ కుమార్ హెచ్చరించారు.



