← Back to news

రోడ్డుపై గుండెపోటు.. పల్నాడులో దారుణం!

By rajaratnam· 2d ago
రోడ్డుపై గుండెపోటు.. పల్నాడులో దారుణం!

పల్నాడు జిల్లా రాజుపాలెం మండలంలో విషాదం చోటుచేసుకుంది. వీరమ్మ కాలవ సమీప హైవేపై ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తున్నారు. కొండమోడు నుంచి నకరికల్లు వైపు వెళ్తుండగా.. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆయన నడిరోడ్డుపై కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి వివరాలు ఇంకా తెలియలేదు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. మీకు ఈ వ్యక్తి గురించి ఏమైనా సమాచారం తెలిస్తే.. వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయండి. ఇలాంటి హఠాత్ మరణం ఎంత బాధాకరమో కదా?

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 6h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.