ఇన్వెస్టర్లు రాడానికి మూడు S లే కారణం - నారా లోకేష్

పారిశ్రామికవేత్తలు ఏపీవైపు మొగ్గు చూపడానికి మూడు “ఎస్” లు ప్రధాన కారణం. స్పీడ్ (వేగం), స్టెబిలిటీ (స్థిరత్వం), సర్వీస్ (సేవ)...ఈ మూడే మా విజయ రహస్యాలు అంటున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. అమరావతి, ఏఐ, క్వాంటమ్ వాలీ ఈ ఆలోచనలన్నీ చంద్రబాబువేనని తాను కేవలం ఎగ్జిక్యూషన్ మాత్రమే చేస్తున్నానని అన్నారు. తమది ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ భావంతోనే పనిచేస్తున్నామని లోకేష్ అన్నారు. దేశచరిత్రలోనే అతిపెద్ద ఎఫ్ డీఐ గూగుల్ డేటా సెంటర్ కేవలం 13నెలల్లో పనులు ప్రారంభించగలగడం తమ గొప్పతనమేనన్నారు, రిపబ్లిక్ టీవీకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడిం



