వీల్చైర్ లేక రోగిని భుజాలపై మోసుకెళ్లాల్సిన దుస్థితి

TG: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కనీస వసతులు లేక రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థోపెడిక్ సమస్యతో చికిత్స కోసం వచ్చిన ఓ రోగిని ఎక్స్రేకు తీసుకెళ్లేందుకు వీల్చైర్ అందుబాటులో లేకపోవడంతో బంధువులు అతడిని భుజాలపై మోసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటనతో ఆస్పత్రిలో వసతుల పరిస్థితిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవసరమైన సంఖ్యలో వీల్చైర్లు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో ప్రతిరోజూ రోగులు ఇబ్బందులు పడుతున్నారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.


