గోదావరి పుష్కరాల లోపు ఆలయ పనులు పూర్తి

TG: జగిత్యాల జిల్లా ధర్మపురిలో శ్రీ యోగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను పురావస్తు శాఖ అనుమతి రాగానే ప్రారంభిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. స్వామివారిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణాన్ని గోదావరి పుష్కరాల లోపు పూర్తి చేస్తామని చెప్పారు. సోమవారం తెల్లవారుజామున 2:48 గంటలకు నిర్వహించే భూమిపూజ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని మంత్రి పిలుపునిచ్చారు.



