← Back to news

కిడ్నీ పరీక్షలకు కొత్త డివైస్

By RK· 25 Jul 2026
కిడ్నీ పరీక్షలకు కొత్త డివైస్

TG: కిడ్నీ ఆరోగ్యాన్ని వెంటనే టెస్ట్ చెయ్యడానికి బిట్స్ పిలానీ హైదరాబాద్ రీసెర్చర్స్ పోర్టబుల్ డివైస్‌ను తయారు చేశారు. బ్లడ్ సీరం నమూనా ఆధారంగా యూరిక్ యాసిడ్, యూరియా, క్రియాటినిన్ స్థాయిలను ఇది నిమిషాల్లో గుర్తిస్తుంది. ఐఓటీ టెక్నాలజీ ద్వారా రిజల్ట్స్ నేరుగా ఫోన్ లేదా కంప్యూటర్‌కు పంపుతుంది. ఖరీదైన ల్యాబ్‌లు, ఎక్స్‌పర్ట్స్ అవసరం లేకుండానే ఈ డివైస్ పనిచేస్తుంది. మొదటి దశలోనే కిడ్నీ జబ్బులను గుర్తించడానికి, ఈ డివైస్ ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు.

More in Health