రేషన్ కార్డు e-KYCకి ఈనెల 31 లాస్ట్ డేట్!

TG : తెలంగాణలో రేషన్ కార్డుదారులకు ఈ-కేవైసీ చేసుకోవడానికి ఈనెల 31ని ప్రభుత్వం లాస్ట్ డేట్గా నిర్ణయించింది. వేలిముద్రలు పడక, సాంకేతిక సమస్యలతో కేవైసీ అవ్వక, ఒక్కో మండలంలో ఇంకా 1,000 నుంచి 2,000 వరకు రేషన్ కార్డులకు ఈ-కేవైసీ కాలేదు. ప్రభుత్వం రూల్స్ పేరుతో రేషన్ కార్డులను తొలగించే కుట్ర చేస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. గడువులోగా పూర్తి చేయకపోతే రేషన్ సరుకులు నిలిపివేసే అవకాశం ఉండటంతో కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు.



