అటానమస్ డ్రోన్లతో సైనికులను మట్టు పెట్టొచ్చు

యుద్ధరంగంలో చరిత్రలోనే తొలిసారిగా పూర్తిగా స్వయంప్రతిపత్తితో పనిచేసే డ్రోన్లు సైనికులను మట్టుబెట్టాయి. ఉక్రెయిన్ రక్షణ రంగానికి చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. రెండేళ్ల క్రితం ఒక నిర్దిష్ట ప్రాంతంలో శత్రువులను గుర్తించి, నాశనం చేసేందుకు నిర్వహించిన డ్రోన్ పరీక్షల్లో సైనికులు మరణించినట్లు నిర్ధారణ అయింది. ఈ ఘోర ఘటనా వివరాలు 'న్యూ సైంటిస్ట్' పత్రిక ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చాయి.



