సామాజిక న్యాయం కోసం గ్రామాల్లో BSP యాత్ర

TG: సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం, సామాజిక న్యాయం వంటి విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు BSP గ్రామస్థాయి ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో బాబాసాహెబ్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, గౌతమ బుద్ధుడు చూపిన మార్గాన్ని ప్రజలకు వివరించేందుకు గ్రామ గ్రామాన పర్యటించాలని నిర్ణయించారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గొల్ల సతీష్, నారాయణఖేడ్ నియోజకవర్గ అధ్యక్షుడు అనుముల తుకారాం ఆధ్వర్యంలో సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామం నుంచి యాత్ర ప్రారంభమైంది.



