మిషన్ భగీరథ పనులను పరిశీలించిన ఎమ్మెల్యేలు

TG: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా శామీర్పేట్ మండలం ఘంపూర్ గుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మిషన్ భగీరథ పనులను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.210 కోట్లతో చేపడుతున్న తాగునీటి సరఫరా పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.





