పరకాలలో SR ఉన్నత పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు

హన్మకొండ జిల్లా పరకాలలోని SR ఉన్నత పాఠశాలలో గురువారం కృష్ణజన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. ప్రధానోపాధ్యాయులు శ్రీకృష్ణుని లీలలు, భగవద్గీత విశిష్టతను వివరించారు. ఛైర్మన్ వరదారెడ్డి, డీజీఎం సచిన్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.




