← Back to news

బిహార్‌లో స్టూడెంట్స్ ఎందుకు రోడ్డెక్కారు?

By Nani Garikina· 25 Aug 2026· Reuters
బిహార్‌లో స్టూడెంట్స్ ఎందుకు రోడ్డెక్కారు?

ప్రభుత్వ ఉద్యోగం కోసం చదివిన స్టూడెంట్స్.. ఇప్పుడు అదే పరీక్షను రద్దు చేయాలంటూ రోడ్డెక్కారు! 👀 బిహార్‌లో 70వ BPSC పరీక్షలో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలు ఉన్నాయని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో ఒకే దశలో పరీక్ష పెట్టాలని, నెగెటివ్ మార్కింగ్ తీసేయాలని కూడా కోరుతున్నారు. ఇవే డిమాండ్లతో పాట్నాలో సీఎం నివాసం వైపు మార్చ్ చేయగా.. పోలీసులు వాటర్ కేనన్లు, లాఠీలతో అడ్డుకున్నారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 4h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.