దాచేపల్లిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

AP: పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని ముత్యాలంపాడు రోడ్డు వద్ద అర్ధరాత్రి రెండు లారీలు ఢీకొని రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు వైపు నుంచి పట్టణంలోకి వస్తున్న రెండు లారీలు మలుపు వద్ద ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ లారీ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, మరో లారీ స్వల్పంగా దెబ్బతింది. లారీల్లో ఉన్న డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న దాచేపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



