← Back to news

దాచేపల్లిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

By siva NEWS· 1d ago
దాచేపల్లిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

AP: పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని ముత్యాలంపాడు రోడ్డు వద్ద అర్ధరాత్రి రెండు లారీలు ఢీకొని రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు వైపు నుంచి పట్టణంలోకి వస్తున్న రెండు లారీలు మలుపు వద్ద ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ లారీ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, మరో లారీ స్వల్పంగా దెబ్బతింది. లారీల్లో ఉన్న డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న దాచేపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 4h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.