← Back to news

డివైడర్‌ను ఢీకొన్న RTC బస్సు.. ప్రయాణికులకు గాయాలు

By Mahesh· 14h ago· AP
డివైడర్‌ను ఢీకొన్న RTC బస్సు.. ప్రయాణికులకు గాయాలు

AP: నంద్యాల జిల్లా డోన్‌లో RTC బస్సుకు యాక్సిడెంట్ జరిగింది. కర్నూలు నుంచి డోన్‌కు వస్తున్న బస్సు ITI కాలేజ్ దగ్గర స్కూటీపై వెళ్తున్న భార్యాభర్తలను తప్పించబోయి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సులోని కొందరి ప్యాసింజర్లకు గాయాలయ్యాయి. యాక్సిడెంట్ జరిగిన వెంటనే స్థానికులు రెస్పాండ్ అయ్యి గాయపడిన వారిని డోన్ Govt. హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం వారికి ట్రీట్‌మెంట్ కొనసాగుతోంది.

More in AP