రమానందనకు మరో షాక్!

వీసా చీటింగ్ కేసులో యూట్యూబర్ రమానందన ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట విచారణకు లాయర్లతో హాజరయ్యారు. విదేశాల్లో వీసా ఉద్యోగం ఇప్పిస్తానని రమానందన దంపతులు 13 లక్షలు వసూలు చేసినట్టు క్రాంతి కుమార్ చేసిన కంప్లైంట్తో కేసు నమోదైంది. నిన్న UK నుంచి హైదరాబాద్ చేరిన ఆమె విచారణకు రావాలని పోలీసులు నోటీసు ఇచ్చారు. వీసా రెన్యువల్ పేరుతో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలతో అద్దంకి పోలీస్స్టేషన్లో మరో కేసు నమోదైంది. బాధితులు ఇబ్రహీంపట్నం స్టేషన్కు చేరుకుంటున్నారు.



