← Back to news

వైఎస్ సేవలకు.. నందిపేట నివాళి!

By naveed mohd· 2d ago

నిజామాబాద్ జిల్లా నందిపేటలో వైఎస్ వర్ధంతి ఘనంగా జరిగింది. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దూడ వెంకటేష్ వైెఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. వైఎస్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ’’ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు.. ఇవన్నీ పేదల కోసమే! లక్షలాది కుటుంబాల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయి. ఇంతటి సంక్షేమ పథకాలు అమలు చేసిన మహానేతను మర్చిపోవడం సాధ్యమా? వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంద’’ని అన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 5h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.