వైఎస్ సేవలకు.. నందిపేట నివాళి!
నిజామాబాద్ జిల్లా నందిపేటలో వైఎస్ వర్ధంతి ఘనంగా జరిగింది. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దూడ వెంకటేష్ వైెఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. వైఎస్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ’’ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు.. ఇవన్నీ పేదల కోసమే! లక్షలాది కుటుంబాల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయి. ఇంతటి సంక్షేమ పథకాలు అమలు చేసిన మహానేతను మర్చిపోవడం సాధ్యమా? వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంద’’ని అన్నారు.



