విజయ్ సర్కార్ భారీ డీల్.. ఆ పథకానికి డేట్ ఫిక్స్!

తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న ‘థాయ్ మామన్ తంగ మోతిరం’ పథకానికి భారీ ఆర్డర్ ఖరారైంది. ఈ పథకం కింద 4.41 లక్షల గోల్డ్ రింగ్స్ను తయారు చేస్తారు. రూ.755 కోట్ల విలువైన ఈ ఆర్డర్కు జోయాలుక్కాస్, కల్యాణ్ జ్యువెలర్స్ టెండర్లు దక్కించుకున్నాయి. టెండర్లో ఈ రెండు సంస్థలు తక్కువ రేటుకు కోట్ చేసాయి. దీంతో పనులను 70:30 రేషియోలో కేటాయించారు. మొదటి నాలుగు నెలల్లో 1,28,499 ఉంగరాలు సప్లై చేయనున్నారు. ఈ స్కీమ్ను సెప్టెంబర్ 15, మాజీ CM అన్నాదురై పుట్టినరోజున ప్రభుత్వం అమలు చేసే అవకాశముంది.



