కారు–బైక్ ఢీ.. యువకుడి పరిస్థితి విషమం

AP: కారు, బైక్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. రౌతులపూడి మండలం బంగారిపేట గ్రామంలో జరిగిన ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ములగపూడి గ్రామానికి చెందిన కాపారపు మిలీషా రాజుకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్లో రౌతులపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.



