పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీం విచారణ షురూ !

జూలై 20న ఢిల్లీ పార్లమెంట్ మార్చ్ సమయంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) నిరసనకారులపై పెల్లెట్ గన్స్ వాడటం వివాదాస్పదమైంది. నడుము కంటే కిందకే కాల్పులు జరపాలనే నిబంధనలు ఉన్నప్పటికీ, బాధితులందరికీ కళ్ళు, ముఖం, మెడ, ఛాతీ భాగాల్లోనే తీవ్ర గాయాలయ్యాయి. ఈ కాల్పుల్లో ఓ విద్యార్థి చూపు కోల్పోయే ప్రమాదంలో పడగా, విలేకరి సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమశిక్షణా రాహిత్యం ,బలగాల నియమావళి ఉల్లంఘనపై సుప్రీంకోర్టు విచారణతో పాటు అంతర్గత విచారణ కూడా మొదలైంది.



