← Back to news

గొంతునొప్పికి భూత వైద్యం.. గర్భిణి మృతి

By DK· 17 Jul 2026
గొంతునొప్పికి భూత వైద్యం.. గర్భిణి మృతి

TG: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా కుంట మండలం మారాయిగూడెం గ్రామానికి చెందిన కురసం హెంకి ఆరునెలల గర్భిణి. ఆమెకు గొంతు నొప్పి రావడంతో స్థానిక భూత వైద్యుడిని సంప్రదించింది. చికిత్స పేరుతో అతడు మహిళ గొంతును బలంగా కొరకడంతో తీవ్ర గాయమై ఇన్ఫెక్షన్ సోకింది. ముఖం, గొంతు తీవ్రంగా వాచిపోయింది. పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు ఆమెను భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ICUలో ఉంచి చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి మృతి చెందింది.

More in TG