డ్రగ్స్కు దూరంగా ఉంటేనే మంచి భవిష్యత్తు: SI
AP: మాదకద్రవ్యాల అలవాటుతో విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఎస్సై రవిచంద్రకుమార్ హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక జడ్పీ ఉన్నత పాఠశాలలో ‘కనెక్ట్ యూత్’ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువుపై పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యంతో పాటు విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. బాలికల భద్రతకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు.



