← Back to news

18 ఎకరాల సర్కారు భూమి... HC చెప్పినా సర్వే చేయరా?

By samson· 2d ago
18 ఎకరాల సర్కారు భూమి... HC చెప్పినా సర్వే చేయరా?

అధికారులు హై కోర్టు చెప్పినా వినట్లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో విద్యానగర్ పంచాయతీ పరిధిలోని 18 ఎకరాల సర్కారు భూమి కబ్జాకు గురైంది. హైకోర్టు 3 కేసుల్లో (WP 1169, 6059, 5706) ఆ భూమి సర్కారుదేనని స్పష్టం చేసింది. రెవెన్యూ అధికారులు మాత్రం ఒక్క కేసునే సర్వే చేసి ఆగిపోయారు. మిగిలిన భూమిని సర్వే చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ’’ఇంతకీ మిగిలిన 17 ఎకరాల విషయంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? కబ్జాదారులతో ఏమైనా కుమ్మక్కు అయ్యారా‘‘అని వారు ప్రశ్నిస్తున్నారు.

18 ఎకరాల సర్కారు భూమి... HC చెప్పినా సర్వే చేయరా?
18 ఎకరాల సర్కారు భూమి... HC చెప్పినా సర్వే చేయరా?

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 7h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.