← Back to news

పొలాల్లో గడ్డి కాల్చడంతో పర్యావరణానికి నష్టం

By dk yamjala· 27 May 2026
 పొలాల్లో గడ్డి కాల్చడంతో పర్యావరణానికి నష్టం

మెదక్ జిల్లా: పంట కోత అనంతరం పొలాల్లో మిగిలిన వరి, మొక్కజొన్న గడ్డిని కాల్చడం వల్ల నేల సారవంతం తగ్గడంతోపాటు పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని మాసాయిపేట మండల వ్యవసాయ అధికారిణి కవిత తెలిపారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ పదార్థం, ప్రయోజనకర సూక్ష్మజీవులు నశించి పోషకాల లోపం ఏర్పడుతుందని చెప్పారు. పంట గడ్డిని కాల్చడం వల్ల వాయు కాలుష్యం, గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారం పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు.

More in Local