కళాశాల ఎదుట SFI నాయకుల ఆందోళన

TG: ప్రైవేట్ కళాశాలల అధిక ఫీజులపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎస్వీ జూనియర్ కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు బొజ్జ హేమంత్ మాట్లాడుతూ.. అడ్మిషన్ల సమయంలో ఫీజులు తీసుకోమని చెప్పి, తర్వాత విద్యార్థుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. టీసీలు, ఒరిజినల్ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు ఇవ్వకుండా ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నారని అన్నారు.



