Latest

40 కి.మీ వేగంతో గాలులు, పిడుగుల ముప్పు..
News· 12 Aug 2026

40 కి.మీ వేగంతో గాలులు, పిడుగుల ముప్పు..

వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. వాతావరణ శాఖ ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నిర్మల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. గంటకు 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులు, పిడుగులు పడే ముప్పు ఉన్నందున ప్రజలు సురక్షితంగా ఉండాలని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తెలిపింది.

యువతే దేశానికి బిగ్ పవర్
TG· 12 Aug 2026

యువతే దేశానికి బిగ్ పవర్

TG: అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చివుకుల ఉష పాల్గొని మాట్లాడారు. యువశక్తితోనే దేశ ప్రగతి సాధ్యమని పేర్కొన్నారు. యువత మద్యపానం, ధూమపానం, మాదకద్రవ్యాలు, సోషల్ మీడియా వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని విద్య, ఉపాధి రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

గంజాయి మత్తులో ఉన్నాడా? పోలీస్ కాలర్ పట్టుకొని బెదిరించి..
Politics· 12 Aug 2026

గంజాయి మత్తులో ఉన్నాడా? పోలీస్ కాలర్ పట్టుకొని బెదిరించి..

తిరుపతి జిల్లా: ఓ యువకుడు పోలీస్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకొని బెదిరించిన షాకింగ్ వీడియో ఇది. శ్రీకాళహస్తి వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్‌ రమణయ్యను యువకుడు బెదిరించి దాడి చేసిన ఘటన లేటుగా వైరలైంది. విచ్ఛలవిడిగా దొరుకుతున్న గంజాయి వల్లే ఏపీలో ఇలా రెచ్చిపోతున్నారని <a href="https://x.com/JaganannaCNCTS/status/2087395778667119064?s=20"> YSRCP సోషల్ మీడియా హ్యాండిల్ పోస్ట్</a> చేసింది. ఈ ఘటన ఎప్పుడు జరిగింది. కానిస్టేబుల్-యువకుడి మధ్య గొడవేంటి, కేసు ఫైల్ అయ్యిందా లేదా అనే విషయాలు ఇంకా తెలియాలి. తెలిస్తే Appలో ప్లస్ సింబల్(+) క్లిక్ చేసి న్యూస్ మీరే ఆ న్యూస్ పోస్ట్ చెయ్యండి.

CM విజయ్‌కు డీఎంకే మద్దతు
National· 12 Aug 2026

CM విజయ్‌కు డీఎంకే మద్దతు

కేంద్ర ప్రభుత్వం చేయాలని చూస్తున్న డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా టీవీకే ప్రభుత్వం తీసుకున్న తీర్మానానికి తమిళనాడు అసెంబ్లీ సమావేశంలో డీఎంకే మద్దతు తెలిపింది. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ‘డీలిమిటేషన్ పేరుతో పార్లమెంటు సభ్యుల సంఖ్య తగ్గకూడదు. వచ్చే 25 ఏళ్లపాటు డీలిమిటేషన్ చేయకూడదనేదే మా స్టాండ్’ అని చెప్పారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తీర్మానాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తమిళనాడుకు డీలిమిటేషన్ వల్ల నష్టం జరగకూడదని నిర్ణయించినట్టు తెలిపారు.

పట్టపగలే గుడి దగ్గర గుప్త నిధుల వేట
TG· 12 Aug 2026

పట్టపగలే గుడి దగ్గర గుప్త నిధుల వేట

TG: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయన్న ప్రచారం కలకలం రేపుతుంది. గ్రామ సమీపంలోని పురాతన దేవాలయం సందెరెల్లి గుల్ల వద్ద భారీగా మట్టి తవ్వి గుంత ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. తవ్వకాలకు ఉపయోగించిన పరికరాలు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై చర్చ జరుగుతోంది. అర్ధరాత్రి, పట్టపగలే తవ్వకాలు జరుగుతుంటే పోలీసులకు, రెవెన్యూ అధికారుల కళ్లకు కనిపించడం లేదా అని, లేక సమాచారం ఉన్నప్పటికీ పట్టించుకోవట్లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్!
Business· 12 Aug 2026

గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్!

బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజూ గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. బుధవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ₹1,040 పెరిగి ₹1,54,860కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ₹950 పెరిగి ₹1,41,950 వద్ద, 18 క్యారెట్ల బంగారం ₹770 పెరిగి ₹1,16,140 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం ధరలు ఎప్పటికప్పుడు మారుతున్నందున, బంగారం కొనేముందు లైవ్ రేట్స్‌ను చెక్ చేసుకోవడం మంచిది.

నిద్రలో ఉన్న భార్యపై ఇటుకతో దాడి
TG· 12 Aug 2026

నిద్రలో ఉన్న భార్యపై ఇటుకతో దాడి

TG: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని ద్వారకానగర్‌లో మాధవి (37)ని ఆమె భర్త కాట్రావత్ రాజు సిమెంట్ ఇటుకతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. 18ఏళ్ల క్రితం వివాహమైన ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా రాజు మద్యానికి బానిసై భార్యను అనుమానిస్తూ వేధిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గత అర్ధరాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన రాజు.. కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో మాధవిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

వెండితెరపై 'మిర్జాపూర్'
Cinema· 12 Aug 2026

వెండితెరపై 'మిర్జాపూర్'

భారతీయ ఓటీటీ చరిత్రలో సంచలనం సృష్టించిన క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’ ఇప్పుడు వెండితెరపై అలరించేందుకు సిద్ధమైంది. రితేష్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్ నిర్మిస్తున్న ఈ భారీ మూవీ అధికారిక ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. గుర్‌మీత్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా, సిరీస్‌లో అదరగొట్టిన ప్రధాన నటీనటులందరూ మళ్లీ పెద్ద తెరపై కనిపించనున్నారు . ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 4న థియేటర్లలోకి రానుంది.

స్టూడెంట్స్‌కు నీళ్ల చారు, ఉడకని అన్నం
AP· 12 Aug 2026

స్టూడెంట్స్‌కు నీళ్ల చారు, ఉడకని అన్నం

AP: కర్నూలు జిల్లా హొళగుంద ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతపై SFI నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నీళ్ల చారు, సరిగ్గా ఉడకని అన్నం అందిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులతో కలిసి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రస్తుత వంట ఏజెన్సీని వెంటనే రద్దు చేసి, నాణ్యమైన, పౌష్టికాహారం అందించే ఏజెన్సీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

జైలులో ఫోన్-పెన్‌డ్రైవ్‌తో చిక్కిన ప్రజ్వల్ రేవణ్న
Politics· 12 Aug 2026

జైలులో ఫోన్-పెన్‌డ్రైవ్‌తో చిక్కిన ప్రజ్వల్ రేవణ్న

బెంగళూరు: హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న (మాజీ ప్రధాని HD దేవెగౌడ మనవడు) జైల్లో జల్సాలు చేస్తున్నాడా? పనిమనిషిపై రేప్ కేసులో జీవిత ఖైదీగా ఉన్న రేవణ్న దగ్గర ఫోన్, పెన్ డ్రైవ్ గుర్తించారు. 2024 లోక్‌సభ ఎన్నికల టైంలో బయటికొచ్చిన రేవణ్న సెక్స్ కుంభకోణం పెద్ద సంచలనం. JDS-BJP అభ్యర్థిగా పోటీ చేసిన రేవణ్న ఆ ఎన్నికల్లో ప్రధాని మోదీ వచ్చి ప్రచారం చేసినా ఓడిపోయారు. 2025లో కోర్టు దోషిగా తేల్చి జీవిత ఖైదు శిక్ష వేసింది. రేవణ్నకు ఫోన్ ఎలా వచ్చిందో దర్యాప్తు చేస్తున్నారు. ఓ జైలు అధికారిని సస్పెండ్ చేశారు.

హాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టేలా 'రామాయణ'
Cinema· 12 Aug 2026

హాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టేలా 'రామాయణ'

నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మైథలాజికల్ సినిమా 'రామాయణ' పార్ట్-1 నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా 59 వేల స్క్రీన్లలో విడుదల కానుంది. సోనీ పిక్చర్స్ భాగస్వామ్యంతో కేవలం ఓవర్సీస్‌లోనే 50 వేల స్క్రీన్లలో విడుదల చేస్తూ ‘పుష్ప 2’, ‘RRR ’లతో పాటు హాలీవుడ్ చిత్రం ‘అవతార్ 2’ రికార్డులను కూడా ఇది దాటుతుంది. ఈ సినిమాని 'బ్రహ్మ AI' అడ్వాన్స్డ్ టెక్నాలజీతో 40కి పైగా భాషల్లో గ్లోబల్ ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు.

లాజిస్టిక్స్ గోదాంలో షాకింగ్ ఫైర్
TG· 12 Aug 2026

లాజిస్టిక్స్ గోదాంలో షాకింగ్ ఫైర్

TG: మేడ్చల్ జిల్లా దేవరయంజాల్‌లోని కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సుమారు రెండు గంటలుగా మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు తెచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియల్సి ఉంది.

నిద్రలో ఒక్కసారిగా కింద పడుతున్నట్టు ఎందుకు అనిపిస్తుంది? 💤
Science· 12 Aug 2026

నిద్రలో ఒక్కసారిగా కింద పడుతున్నట్టు ఎందుకు అనిపిస్తుంది? 💤

నిద్రలోకి జారుకుంటున్నప్పుడు ఒక్కసారిగా కింద పడుతున్నట్టు అనిపించి ఉలిక్కిపడటం చాలామందికి జరుగుతుంది. దీనిని ‘హిప్నిక్ జర్క్’ అంటారు. నిద్రలోకి మారే సమయంలో కండరాలు ఒక్కసారిగా జర్క్ అవడం వల్ల ఈ అనుభూతి వస్తుంది. మనం నిజంగా పడిపోతున్నామని కాదు.. మెదడు, శరీరం మేల్కొనే స్థితి నుంచి నిద్రలోకి మారుతున్న సమయంలో వచ్చే సహజ స్పందన ఇది. ఒత్తిడి, నిద్రలేమి, ఎక్కువ కెఫీన్ వంటివి దీన్ని మరింత పెంచొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అప్పుడప్పుడు ఇలా జరగడం సాధారణమే. మీకు కూడా ఇలా జరిగిందా? కామెంట్‌లో చెప్పండి. 👇

మణిపూర్‌లో మళ్లీ హింస!
News· 12 Aug 2026

మణిపూర్‌లో మళ్లీ హింస!

కొన్నాళ్లుగా వార్తల్లో లేని మణిపూర్ ప్రశాంతంగా అయితే లేదు. జాతుల మధ్య ఘర్షణలు ఇంకా కొనసాగుతున్నాయి. కాంగ్‌పోక్పి జిల్లాలోని 'టోక్‌పా లియాంగ్‌మై నాగా' గ్రామంలోకి మంగళవారం రాత్రి కొందరు కాల్పులు జరుపుతూ, ఇళ్లకు నిప్పు పెట్టారు. దాదాపు 9 గుడిసెలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. 2023 మే నెలలో మణిపూర్లో కుకీ, మెయిటీ జాతుల మధ్య ఘర్షణ తలెత్తి వందల మంది చనిపోయారు. వేలాది మంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. 2025 ఫిబ్రవరి 13 నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది.

మనవడి కోసం 400 KM పాదయాత్ర
AP· 12 Aug 2026

మనవడి కోసం 400 KM పాదయాత్ర

AP: గుంటూరు కృష్ణానగర్‌కు చెందిన ఆకుల కామేశ్వరి మనవడు ధనుష్‌(20) రెండేళ్ల క్రితం అనారోగ్యానికి గురై కాళ్లు, చేతులు చచ్చుబడిన పరిస్థితికి చేరుకున్నాడు. వైద్యులు కోలుకోవడం కష్టమని చెప్పడంతో వెంకన్నపై భారం వేసిన కామేశ్వరి, మనవడి ఆరోగ్యం మెరుగుపడితే గుంటూరు నుంచి తిరుమలకు నడిచి వస్తానని మొక్కుకున్నారు. ఆరోగ్యంలో కొంత మార్పు రావడంతో జూన్‌ 11న పాదయాత్ర ప్రారంభించారు. 57రోజుల పాటు గోవింద నామస్మరణ చేస్తూ 400కిలో మీటర్లు ప్రయాణించి తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు.

లైబ్రరీ ఫండ్స్ బకాయిలు..
News· 12 Aug 2026

లైబ్రరీ ఫండ్స్ బకాయిలు..

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ గ్రంథాలయాల అభివృద్ధి కోసం విడుదల చేయాల్సిన నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు, పంచాయతీలు ప్రజల నుంచి వసూలు చేసే ఆస్తి పన్నుతో పాటు 8శాతం 'లైబ్రరీ సెస్'ను కూడా వసూలు చేస్తాయి. అయితే, ఈ విధంగా వసూలైన నిధులను మున్సిపాలిటీలు, పంచాయతీలు గ్రంథాలయ సంస్థలకు బదిలీ చేయడంలో ఆలస్యం చేస్తున్నాయి. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో రూ. 213 కోట్లు, తెలంగాణలో రూ. 302.49 కోట్ల మేర లైబ్రరీ సెస్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.

తల్లి కాబోతున్న వేళ విషాదం..  ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
TG· 12 Aug 2026

తల్లి కాబోతున్న వేళ విషాదం.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

TG: ప్రసవం కోసం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చేరిన 9నెలల గర్భిణీ అనిత (33) మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. చౌటకూర్ మండలం బద్రిగూడెంకు చెందిన అనితను కుటుంబసభ్యులు ఈ నెల 10న ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆమెకు ఇవాళ తెల్లవారుజామున ఫిట్స్ రావడంతో మృతి చెందినట్లు వైద్యులు కుటుంబసభ్యులకు తెలిపారు. అయితే సరైన సమయంలో వైద్యం అందకపోవడం, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ కూతురు మృతి చెందిందని బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

హైదరాబాద్‌కు 'ట్రంప్' టవర్స్
News· 12 Aug 2026

హైదరాబాద్‌కు 'ట్రంప్' టవర్స్

TG : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి అమెరికాకు చెందిన ప్రముఖ 'ట్రంప్ ఆర్గనైజేషన్' అడుగుపెట్టింది. ట్రెబెకా డెవలపర్స్, స్థానిక ఇరా రియల్టీ భాగస్వామ్యంతో కోకాపేట్ గోల్డెన్ మైల్ రోడ్డులోని 4 ఎకరాల్లో 65 అంతస్తులతో రెండు ట్రంప్ టవర్లను నిర్మిస్తున్నారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా రూ.1,800 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టులో 450 లగ్జరీ అపార్ట్‌మెంట్లు, 16 పెంట్ హౌస్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది చివర్లో పనులు ప్రారంభించి నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు.

మళ్లీ పెరిగిన బంగారం ధరలు!
News· 12 Aug 2026

మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు వరుసగా పెరుగుతూ కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.1,040 పెరిగి రూ.1,54,860 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.950 పెరిగి రూ.1,41,950 వద్ద, 18 క్యారెట్ల బంగారంపై రూ.770 పెరిగి రూ.1,16,140కి చేరింది. బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతుండటంతో కొనేవారు భయపడుతున్నారు.

మళ్లీ హాస్టల్‌కు పంపుతారనే భయంతో బాలిక ఆత్మహత్య
TG· 12 Aug 2026

మళ్లీ హాస్టల్‌కు పంపుతారనే భయంతో బాలిక ఆత్మహత్య

TG: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొంది గ్రామానికి చెందిన 11ఏళ్ల బాలిక మైనారిటీ హాస్టల్‌లో 5వ తరగతి చదువుతుంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రేషన్‌కార్డు eKYC కోసం పదిరోజుల క్రితం తల్లి ఆమెను ఇంటికి తీసుకొచ్చింది. అయితే తిరిగి హాస్టల్‌కు వెళ్లేందుకు బాలిక ఇష్టపడకపోవడంతో, ఆమెను హాస్టల్ నుంచి మాన్పించి TC తీసుకురావడానికి తల్లి అక్కడికి వెళ్లింది. ఈ సమయంలో బాలిక ఇంట్లోనే ప్రాణాలు తీసుకుంది. తిరిగి హాస్టల్‌కు పంపిస్తారనే భయంతోనే ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

మనకు మనమే టిక్లింగ్ చేసుకుంటే ఎందుకు నవ్వుకోలేం? 🤔
Education· 12 Aug 2026

మనకు మనమే టిక్లింగ్ చేసుకుంటే ఎందుకు నవ్వుకోలేం? 🤔

మనకు మనమే టిక్లింగ్ చేసుకుంటే ఎందుకు పెద్దగా నవ్వు రాదు? కారణం మన మెదడు ముందుగానే మనం చేయబోయే పనిని అంచనా వేయడమే. మన చేతి కదలికతో వచ్చే స్పర్శను మెదడులోని సెరెబెల్లమ్ ముందే ఊహించి, ఆ అనుభూతిని కొంత తగ్గిస్తుంది. కానీ ఇంకొకరు టిక్లింగ్ చేస్తే ఎప్పుడు, ఎక్కడ తాకుతారో మనకు తెలియదు. అందుకే ఆ స్పర్శ కొత్తగా అనిపించి టిక్లింగ్ ఫీల్ ఎక్కువగా ఉంటుంది. పరిశోధనలు కూడా మనమే చేసుకునే స్పర్శకు మెదడు స్పందన తక్కువగా ఉంటుందని సూచిస్తున్నాయి. మరి మీకు మీరు టిక్లింగ్ చేసుకుంటే ఎలా అనిపిస్తుంది?