Education

గవర్నమెంట్ స్కూళ్లలో  AI టెక్నాలజీ
Education· 30 Jun 2026

గవర్నమెంట్ స్కూళ్లలో AI టెక్నాలజీ

AP విద్యాశాఖ గవర్నమెంట్ స్కూళ్లలో విద్యార్థుల హాజరు నమోదు కోసం కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సరికొత్త ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఉపాధ్యాయుల సమయం ఆదా అవ్వడానికి, హాజరు పారదర్శకతకు, కచ్చితత్వానికి ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుంది. మంగళగిరి, తాడేపల్లి, విజయవాడలో ప్రయోగాత్మకంగా మొదలైన ఈ విధానం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది. విద్యార్థుల ముఖాలను ఫేస్ రికగ్నిషన్ ద్వారా గుర్తించి, గ్రూప్ ఫొటో తీయగానే ఆటోమేటిక్‌గా హాజరు నమోదవుతుంది. టైమ్ సేవ్ అవ్వడమే కాకుండా, హాజరు నమోదులో కచ్చితత్వం, పారదర్శకత పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.

ఇంటర్న్‌షిప్ లేకుండానే ప్రాజెక్ట్ రిపోర్ట్
Education· 27 Jun 2026

ఇంటర్న్‌షిప్ లేకుండానే ప్రాజెక్ట్ రిపోర్ట్

TG : ఉస్మానియా యూనిర్సిటీ పరిధిలోని కొన్ని MBA కాలేజీలు విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ ఇచ్చి కార్పొరేట్ రంగానికి సిద్ధం చేయాల్సి ఉండగా, వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయి. నిబంధనల ప్రకారం విద్యార్థులతో ఇంటర్న్‌షిప్ చేయించి, ప్రాజెక్టు రిపోర్టులు రూపొందించాలి. కానీ ఫేక్ ప్రాజెక్ట్ సర్టిఫికెట్లతో రిపోర్టులు ఇస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు ప్రైవేట్ MBA కాలేజీలు విద్యార్థులను ఏ కంపెనీకీ పంపకుండా, శిక్షణ ఇప్పించకుండానే ఫేక్ సర్టిఫికెట్లతో ముందుకెళ్తున్నాయి. దీని వెనుక OU ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వల్లే అక్రమాలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు ఫైరవుతున్నాయి.

9th క్లాస్ సిలబస్‌లో ఎమర్జెన్సీ.. కాంగ్రెస్‌పై BJP ఫైర్!
Education· 25 Jun 2026

9th క్లాస్ సిలబస్‌లో ఎమర్జెన్సీ.. కాంగ్రెస్‌పై BJP ఫైర్!

9వ తరగతి సోషల్ స్టడీస్ సిలబస్‌లో 1975 నాటి 'జాతీయ ఎమర్జెన్సీ' చాప్టర్‌ను NCERT చేర్చింది. ఈ నిర్ణయాన్ని BJP స్వాగతించగా, ప్రతిపక్షాల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై BJP అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ కాంగ్రెస్‌పై తీవ్రంగా మండిపడ్డారు. 1975 జూన్ 25 దేశ చరిత్రలోనే చీకటి రోజు అని, ఇందిరా గాంధీ అధికారాన్ని వాడుకుని ఎమర్జెన్సీ విధించారని, మీడియాపై ఆంక్షలు పెట్టి ఆఖరికి ఆల్ ఇండియా రేడియో నుండి కిషోర్ కుమార్ పాటలను కూడా తొలగించారని విమర్శించారు. అప్పటి నిజాలు నేటి తరం విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.