Education

తెలంగాణ అంగన్‌వాడీల్లో భారీ నోటిఫికేషన్!
Education· 23 Jun 2026

తెలంగాణ అంగన్‌వాడీల్లో భారీ నోటిఫికేషన్!

తెలంగాణ అంగన్‌వాడీ కేంద్రాల్లో 15,982 పోస్టుల భర్తీకి గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 3,100 టీచర్లు, 12,882 సహాయకుల ఖాళీలు ఉన్నాయి. జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ నోటిఫికేషన్లు రిలీజ్ కానున్నాయి. ఈసారి అప్లై చేయడానికి 'ఇంటర్మీడియట్' క్వాలిఫికేషన్ తప్పనిసరి చేశారు. అలాగే కొత్తగా 10 మార్కులకు ఇంటర్వ్యూ విధానాన్ని కూడా తీసుకొచ్చారు. లోకల్ వార్డు లేదా గ్రామానికి చెందిన మహిళలకే ఇందులో ఛాన్స్ ఉంటుంది. ఇంటర్‌లో వచ్చిన మార్కులతో పాటు వితంతువులు, అనాథలు, దివ్యాంగులకు ప్రత్యేక వెయిటేజీ ఉంటుంది. ఖాళీల పూర్తి వివరాల కోసం మీ జిల్లా నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ఆటోలో క్యాంపస్‌కు.. పట్టుదలకు సెల్యూట్ !
Education· 23 Jun 2026

ఆటోలో క్యాంపస్‌కు.. పట్టుదలకు సెల్యూట్ !

AP: తిరుపతి జిల్లా సత్యవేడుకు చెందిన తుపాకుల మణికి ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో సీటు వచ్చింది. ధ్రువపత్రాల పరిశీలనకు YSR కడప జిల్లా ఇడుపులపాయలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం ఆర్కే వ్యాలీ క్యాంపస్‌కు వెళ్తుండగా దారిలో బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో మణి కాళ్లకు గాయాలయ్యాయి. హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కదల్లేని స్థితిలో ఉన్నా ప్రవేశపత్రం పొందాలని ఆటోలోనే క్యాంపస్‌కు చేరుకుంది. క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్ ప్రకాశ్ స్వయంగా ఆటో వద్దకు వచ్చి ఆమెకు ప్రవేశపత్రం అందించారు.

కూతురి కోసం ఓ తండ్రి ఆవేదన..  ఈ వీడియో చూస్తే కన్నీళ్ళు ఆగవు!
Education· 22 Jun 2026

కూతురి కోసం ఓ తండ్రి ఆవేదన.. ఈ వీడియో చూస్తే కన్నీళ్ళు ఆగవు!

మధ్యప్రదేశ్‌లోని విదిశాలో ఒక హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. జస్ట్ కొంచెం లేట్ అవ్వడం, బయోమెట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, అలాగే అడ్మిట్ కార్డులో మిస్టేక్స్ ఉండటంతో ముగ్గురు అమ్మాయిలు Re-NEET ఎగ్జామ్ రాయలేకపోయారు. తన కూతురిని ఎలాగైనా లోపలికి పంపించాలని ఒక తండ్రి ఎగ్జామ్ సెంటర్ ముందే కిందపడి బోరున ఏడ్చారు. అయినా సరే రూల్స్ అంటూ అధికారులు ఆ స్టూడెంట్స్‌ని అస్సలు అలౌ చేయలేదు. ఇయర్ అంతా కష్టపడి చదివిన ఎగ్జామ్ రాయలేకపోయినందుకు ఆ స్టూడెంట్స్, పేరెంట్స్ అక్కడే కిందపడి ఏడ్చేశారు. దీనికి సంబంధించిన ఎమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

జస్ట్ 1 నిమిషం లేట్! కూతురు కోసం పోలీసుల కాళ్లు పట్టుకున్న తండ్రి!
Education· 22 Jun 2026

జస్ట్ 1 నిమిషం లేట్! కూతురు కోసం పోలీసుల కాళ్లు పట్టుకున్న తండ్రి!

కీసర నీట్ ఎగ్జామ్ సెంటర్‌లో ఒక ఎమోషనల్ ఇన్సిడెంట్ జరిగింది. గూగుల్ మ్యాప్స్ తప్పుగా చూపించడం వల్ల ఒక స్టూడెంట్ కేవలం ఒక్క నిమిషం లేట్‌గా ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చింది. దాంతో ఎగ్జామ్ రాసేందుకు అఫీషియల్స్ పర్మిషన్ ఇవ్వలేదు. తన కూతురి ఫ్యూచర్ పాడైపోతుందని, లోపలికి పంపించాలంటూ ఆ తండ్రి అక్కడున్న పోలీసుల కాళ్లు పట్టుకుని ఏడుస్తూ బతిమాలాడు. అయినా రూల్స్ ఒప్పుకోకపోవడంతో లాభం లేకపోయింది. సంవత్సరం మొత్తం కష్టపడి చదివిన ఎగ్జామ్ రాయలేకపోయామని ఆ స్టూడెంట్, పేరెంట్స్ ఎంతో ఆవేదనతో ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ హార్ట్ బ్రేకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అధికారుల నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం
Education· 21 Jun 2026

అధికారుల నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం

TG: నీట్ ఎగ్జామ్‌లో అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ తప్పుగా పేర్కొనడంతో ముగ్గురు పరీక్ష రాయకుండానే వెనక్కి తిరగాల్సి వచ్చింది. అధికారులు జిల్లాపరిషత్ హైస్కూల్ శివరాంపల్లి రాజేంద్రనగర్‌కు బదులుగా జిల్లాపరిషత్ హైస్కూల్ శివరాంపల్లి హయత్‌నగర్ అని హాల్‌టికెట్‌లో పేర్కొనడంతో విద్యార్థులను అయోమయానికి గురిచేసింది. హయత్‌నగర్‌కు వెళ్లి అక్కడ అడ్రస్ దొరకపోవడంతో అక్కడి నుంచి రాజేంద్రనగర్‌లోని శివరాంపల్లికి చేరుకున్నారు. శివరాంపల్లికి చేరుకునేలోగా టైమ్ గడిచిపోవడంతో పరీక్ష రాయడానికి అనుమతించలేదు.

ఇక వాట్సాప్‌లోనే మార్కుల మెమో
Education· 20 Jun 2026

ఇక వాట్సాప్‌లోనే మార్కుల మెమో

తెలంగాణలో విద్యను బలోపేతం చేసేందుకు CM రేవంత్ రెడ్డి కీలక సంస్కరణలు తీసుకువచ్చారు. విద్యార్థులకు మరింత వేగంగా, పారదర్శకంగా, సులభంగా సేవలను అందించేందుకు వాట్సాప్ ఆధారిత డిజిటల్ సేవలను అధికారికంగా ప్రవేశపెట్టారు. హైదరాబాద్‌లోని LB స్టేడియంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కలిసి CM ఈ సేవలను ప్రారంభించారు. వాట్సాప్ ద్వారానే ప్రోగ్రెస్ రిపోర్టులు, హాల్‌టికెట్లు, మార్కుల మెమోలు, SSC సర్టిఫికెట్లు పొందే అవకాశం కల్పించారు. త్వరలోనే అటెండెన్స్, స్కాలర్‌షిప్‌లు, యూనిఫామ్‌లు, పాఠ్యపుస్తకాల వివరాలు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

రాష్ట్రంలోనే తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం
Education· 17 Jun 2026

రాష్ట్రంలోనే తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం

TG: రాష్ట్రంలోనే తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్(TPS)ను CM రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో పాఠశాల భవనాన్ని ప్రారంభించి, TPS పైలాన్‌ను ఆవిష్కరించారు. పాఠశాలలో 'అల్పాహార పథకాన్ని' ప్రారంభించిన సీఎం, విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద మొదటి విడతలో నాలుగు స్కూళ్లలో ప్రారంభించింది. రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలు ఇందులో ఉన్నాయి.