Education· 20 Jun 2026
ఇక వాట్సాప్లోనే మార్కుల మెమో
తెలంగాణలో విద్యను బలోపేతం చేసేందుకు CM రేవంత్ రెడ్డి కీలక సంస్కరణలు తీసుకువచ్చారు. విద్యార్థులకు మరింత వేగంగా, పారదర్శకంగా, సులభంగా సేవలను అందించేందుకు వాట్సాప్ ఆధారిత డిజిటల్ సేవలను అధికారికంగా ప్రవేశపెట్టారు. హైదరాబాద్లోని LB స్టేడియంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కలిసి CM ఈ సేవలను ప్రారంభించారు. వాట్సాప్ ద్వారానే ప్రోగ్రెస్ రిపోర్టులు, హాల్టికెట్లు, మార్కుల మెమోలు, SSC సర్టిఫికెట్లు పొందే అవకాశం కల్పించారు. త్వరలోనే అటెండెన్స్, స్కాలర్షిప్లు, యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాల వివరాలు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.