Local

నాలుగుసార్లు ఆరెస్సెస్ ప్రోగ్రామ్ హాజరైన జడ్జి - కేజ్రివాల్
Local· 14 Apr 2026

నాలుగుసార్లు ఆరెస్సెస్ ప్రోగ్రామ్ హాజరైన జడ్జి - కేజ్రివాల్

ఢిల్లీ మద్యం పాలసీ కేసుని విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మని ఆ కేసు నుంచి తప్పించాలని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. తన కేసుని తానే వాదించుకుంటున్న కేజ్రివాల్ గట్టిగా తన వాదనలు వినిపించారు. న్యాయమూర్తి RSS అనుబంధ సంస్థ అధివక్త పరిషత్ నిర్వహించిన ప్రోగ్రామ్స్ కి ఏకంగా నాలుగు సార్లు అటెండ్ అయ్యారని, ఒక specific Ideologyకి పరిమితమైన వాళ్ల దగ్గర న్యాయం ఎలా జరుగుతుందని కేజ్రివాల్ క్వశ్చన్ చేశారు. సీబీఐ ఈ వాదనను వ్యతిరేకించింది. వ్యక్తిగత భావజాలంతో సంబంధం లేకుండా జడ్జిలు పనిచేస్తారని వాదించింది.