హైడ్రాకు హైకోర్టు షాక్

తెలంగాణలో అడ్డగోలుగా కూల్చివేతలకు పాల్పడుతున్న హైడ్రాకు హైకోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు కూల్చివేతలు నిలిపివేయాలని ఆదేశించింది. GHMC, పురపాలక సంఘాల చట్టం, ఇతర నిబంధలనకు అనుగుణంగా ఈ కూల్చివేతలకు ఒక విధివిధానాలు, మార్గదర్శకాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా ఐలాపూర్ గ్రామంలో కూల్చివేతల సమయంలో హైడ్రా అత్యుత్యాహంతో ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించిదని, ఆ తీరు సమర్థనీయం కాదని అక్షింతలు వేసింది. కేసు విచారణని ఈ నెల 20కి వాయిదా వేసింది.



