ఉద్దానం బాధితుల కు బయో మార్కర్స్ !!

ఉద్దానంలో కిడ్నీ వ్యాధులకు మూలం కనుక్కునేందుకు బయో మార్కర్స్ టెస్ట్ లు చేస్తారు.. నమూనాలు ఇచ్చిన వారికి వచ్చే నాలుగేళ్లలోపు కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశంపై ఒక అంచనాకు వస్తారు. దానికోసం విశాఖ కేజీహెచ్ లో ప్రత్యేకంగా ల్యాబ్ ను స్టార్ట్ చేశారు. ఐసీఎం ఆర్ ఇచ్చిన6. 2 కోట్ల గ్రాంట్ తో కేజీహెచ్ లో ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేశారు. డీప్ ఫ్రీజర్లు, శాంపిల్ స్టోరేజ్ సిస్టమ్స్ శాంపిల్స్ కిట్స్ ఈ ల్యాబ్ లో ఉన్నాయి. బయో మార్కర్ టెస్టుల ద్వారా శాంపిల్స్ తీసి ఈ ల్యాబ్ లో వాటిని పరిశీలిస్తారు.



