Local

క్లోరినేషన్ తర్వాతే నీటి సరఫరా.. కమిషనర్ స్పష్టం
Local· 26 Aug 2026

క్లోరినేషన్ తర్వాతే నీటి సరఫరా.. కమిషనర్ స్పష్టం

AP: గుంటూరు జిల్లా మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటి రంగులో స్వల్ప మార్పు కనిపించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. గోదావరి జలాలు కృష్ణానదిలో కలవడం వల్ల నీటిరంగులో మార్పు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నీటిని క్లోరినేషన్ చేసి, శుద్ధిచేసిన అనంతరమే ప్రజలకు సరఫరా చేస్తున్నామని కమిషనర్ స్పష్టంచేశారు. మరోవైపు పలు ప్రాంతాల్లో పైపులైన్ లీకేజీలు కూడా నీటి నాణ్యతపై ప్రభావం చూపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజలు ముందుజాగ్రత్తగా నీటిని కాచి, చల్లార్చుకున్న తర్వాతే తాగాలని సూచించారు.