Local· 26 Jun 2026
మత్తులో రచ్చ.. బారికేడ్లతో పట్టుకున్న పోలీసులు
TG: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో మద్యంమత్తులో DCM డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. గుండాలమిట్ట ప్రాంతంలో వేగంగా వెళ్తున్న DCM బొగ్గులారీని, అనంతరం ఓ హోంగార్డుకు చెందిన కారును ఢీకొట్టింది. డీసీఎం ఒకవైపు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయినప్పటికీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంతో వెళ్లాడు. డీసీఎం డోర్ భాగాలు, ఇనుప కడ్డీలు కింద వేలాడుతూ ఉండగా రమణమ్మ అనే మహిళకు తగలడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆపేందుకు ప్రయత్నించగా, డ్రైవర్ తప్పించుకున్నాడు. నేరేడుచర్ల పోలీసులు బైపాస్ రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటచేసి అడ్డుకున్నారు. డ్రైవర్ను అరెస్ట్ చేశారు.