Local

సీటు కోసం RTC బస్సులో రచ్చ .. చివరికి PSకు!
Local· 2 Jul 2026

సీటు కోసం RTC బస్సులో రచ్చ .. చివరికి PSకు!

TG: రాష్ట్రంలో ఫ్రీబస్ స్కీమ్‌తో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. పెరిగిన ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ వైపు నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న RTC బస్సులో సీట్ విషయమై ప్రయాణికుల మధ్య వాగ్వాదం జరిగింది. నర్సాపూర్ వద్ద బస్సు ఎక్కిన మానసిక వికలాంగుడు వినోద్ సీటు కోసం మరో మహిళతో గొడవకు దిగాడు. మహిళపై దాడిచేసి, ఆమె బ్యాగ్‌ను చింపివేయడంతో బస్సులో టెన్షన్ వాతావరణం నెలకొంది. డ్రైవర్ బస్సును నేరుగా నర్సాపూర్ PSకు తీసుకెళ్లారు. పోలీసులు ఇరువర్గాల నుంచి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు.

వాట్పాప్ గ్రూప్‌లో పాలిటిక్స్.. పోలీసులకు ఫిర్యాదు
Local· 27 Jun 2026

వాట్పాప్ గ్రూప్‌లో పాలిటిక్స్.. పోలీసులకు ఫిర్యాదు

TG: హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్-12లోని NBTనగర్ బస్తీ సమస్యలపై చర్చించుకునేందుకు స్థానికులు ఒక వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. గ్రూప్‌లో కొందరు పొలిటికల్ మెసెజెస్ పోస్టు చేస్తున్నారు. గ్రూప్‌లో రాజకీయ పరమైన పోస్టులు పెట్టకూడదని గ్రూప్ అడ్మిన్ హెచ్చరించారు. ఓ మహిళ నిరంతరం పొలిటికల్ మెసెజెస్ పోస్ట్ చేస్తుంది. అడ్మిన్ ఆమెను గ్రూప్ నుంచి రిమూవ్ చేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రూప్ నిబంధనలను ఉల్లంఘించినందుకే ఆమెను తొలగించామని, ఆమెను తిరిగి గ్రూప్‌లో చేర్చుకునే ప్రసక్తేలేదని అడ్మిన్ పోలీసుల ముందే తేల్చి చెప్పాడు.

మత్తులో రచ్చ.. బారికేడ్లతో పట్టుకున్న పోలీసులు
Local· 26 Jun 2026

మత్తులో రచ్చ.. బారికేడ్లతో పట్టుకున్న పోలీసులు

TG: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో మద్యంమత్తులో DCM డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. గుండాలమిట్ట ప్రాంతంలో వేగంగా వెళ్తున్న DCM బొగ్గులారీని, అనంతరం ఓ హోంగార్డుకు చెందిన కారును ఢీకొట్టింది. డీసీఎం ఒకవైపు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయినప్పటికీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంతో వెళ్లాడు. డీసీఎం డోర్ భాగాలు, ఇనుప కడ్డీలు కింద వేలాడుతూ ఉండగా రమణమ్మ అనే మహిళకు తగలడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆపేందుకు ప్రయత్నించగా, డ్రైవర్ తప్పించుకున్నాడు. నేరేడుచర్ల పోలీసులు బైపాస్ రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటచేసి అడ్డుకున్నారు. డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.

టిఫిన్ తింటుండగా ఊహించని షాక్
Local· 26 Jun 2026

టిఫిన్ తింటుండగా ఊహించని షాక్

TG: వరంగల్‌ జిల్లా కాశీబుగ్గకు చెందిన బేతి రాజు స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో వడ పార్సల్‌ తీసుకుని ఇంటికి వెళ్లాడు. వడ తినబోతుండగ బల్లి కనిపించింది. షాక్‌కు గురైన రాజు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టుచేశాడు. హోటల్‌కు వచ్చి జరిగిన విషయం చెప్పగా.. హోటల్‌ నిర్వాహకులు సరైన సమాధానం ఇవ్వకుండా దురుసుగా మాట్లాడినట్లు తెలిపాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్పందించిన ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ మౌనిక సారథ్యంలో కాశీబుగ్గలోని సదరు హోటల్‌ను తనిఖీ చేశారు. హోటల్‌లో నిర్వహణ సరిగా లేకపోవడం, సరైన పత్రాలు లేనట్లు గుర్తించారు. రూ.10వేల జరిమానా విధించి, హోటల్‌ను సీజ్‌ చేశారు.

SC షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల కేటాయింపుల్లో అక్రమాలు
Local· 25 Jun 2026

SC షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల కేటాయింపుల్లో అక్రమాలు

TG: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలోని SC షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని గురువారం దళిత నిరుద్యోగ యువత రిలే నిరాహార దీక్షకు దిగారు. పారదర్శకత లేకపోవడం, అనర్హులకు రాజకీయ సిఫార్సులతో కేటాయింపులు చేయడం వంటి కారణాల వల్ల స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బస్టాండ్ ఎదురుగా ఉన్న SC కాంప్లెక్స్‌లోని 34 దుకాణాలను అర్హులైన పేద దళితులకు ఇవ్వడంలో మొండిచేయి చూపారని, నిరుపేద దళిత నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం పూర్తిగా పక్కదారి పట్టిందని వారు ఫైరయ్యారు.

మదనపల్లెలో "అవునా?" ఫ్లెక్సీలు కలకలం
Local· 21 Jun 2026

మదనపల్లెలో "అవునా?" ఫ్లెక్సీలు కలకలం

AP: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని RTC బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ సర్కిల్‌లో "అవునా?" ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఎలాంటి పార్టీ పేరు, నాయకుడి ఫోటో లేదా సంస్థ వివరాలు లేకుండా కేవలం "అవునా?" అనే ప్రశ్నతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ఫ్లెక్సీల వెనుక ఉద్దేశ్యం ఏమిటి? రాజకీయ సందేశానికా, సామాజిక ప్రచారానికా, లేక మరేదైనా ప్రత్యేక కార్యక్రమానికి సంకేతమా? అనే చర్చలు పట్టణంలో జోరుగా సాగుతున్నాయి. ఒక్క మాటతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ఫ్లెక్సీలు ప్రస్తుతం మదనపల్లెలో హాట్ టాపిక్‌గా మారాయి.

విధుల్లొ అలసత్వం.. అధికారులపై సస్పెన్షన్ వేటు
Local· 17 Jun 2026

విధుల్లొ అలసత్వం.. అధికారులపై సస్పెన్షన్ వేటు

AP: పారిశుధ్య నిర్వహణ పనుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు MPDOలను సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ ఉత్తర్వులు జారీ చేశారు.​ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట MPDO ఏవీ మురళీకృష్ణ, తడ MPDO డీ.శేఖర్ నాయక్‌లను సస్పెండ్ చేశారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన 'స్వచ్ఛ రథాల' ఏర్పాటు, వాటి నిర్వహణలో వీరు అలసత్వం ప్రదర్శించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయడంలో అధికారులు విఫలమయ్యారని కమిషనర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.