టిఫిన్ తింటుండగా ఊహించని షాక్

TG: వరంగల్ జిల్లా కాశీబుగ్గకు చెందిన బేతి రాజు స్థానికంగా ఉన్న ఓ హోటల్లో వడ పార్సల్ తీసుకుని ఇంటికి వెళ్లాడు. వడ తినబోతుండగ బల్లి కనిపించింది. షాక్కు గురైన రాజు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టుచేశాడు. హోటల్కు వచ్చి జరిగిన విషయం చెప్పగా.. హోటల్ నిర్వాహకులు సరైన సమాధానం ఇవ్వకుండా దురుసుగా మాట్లాడినట్లు తెలిపాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్పందించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ మౌనిక సారథ్యంలో కాశీబుగ్గలోని సదరు హోటల్ను తనిఖీ చేశారు. హోటల్లో నిర్వహణ సరిగా లేకపోవడం, సరైన పత్రాలు లేనట్లు గుర్తించారు. రూ.10వేల జరిమానా విధించి, హోటల్ను సీజ్ చేశారు.



