కోతుల కొట్లాటలో మహిళ మృతి

TG: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని కమలాపూర్ రోడ్డు ఇందిరమ్మ కాలనీలో కొనపర్తి సత్యనారాయణ, పద్మ(55) దంపతులు నివాసం ఉంటున్నారు. పద్మ బుధవారం సాయంత్రం ఇంటి ముందు కూర్చొని మరో మహిళతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో ఆ ఇంటిపై రెండు కోతులు తీవ్రంగా కొట్లాడుకోసాగాయి. రేకులు గాలికి ఎగిరిపోకుండా బరువు కోసం పెట్టిన సిమెంట్ ఇటుక కింద కూర్చున్న పద్మ తలపై పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భర్త సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి.మహేష్ తెలిపారు.



