← Back to news

ఎమర్జెన్సీ వార్డులో అగ్ని ప్రమాదం

By dk· 17 Jun 2026· Dishadaily· విజయవాడ
ఎమర్జెన్సీ వార్డులో అగ్ని ప్రమాదం

AP: విజయవాడలోని రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో బుధవారం తెల్లవారుజామున ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్‌లోని ఎమర్జెన్సీ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అలెర్ట్ అయి వార్డులో ఉన్న పిల్లలను వెంటనే మరో వార్డులోకి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఆస్పత్రి సిబ్బంది, యాజమాన్యం నుంచి వివరాలు సేకరించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేశారు.

More in Local