Local

విధుల్లొ అలసత్వం.. అధికారులపై సస్పెన్షన్ వేటు
Local· 17 Jun 2026

విధుల్లొ అలసత్వం.. అధికారులపై సస్పెన్షన్ వేటు

AP: పారిశుధ్య నిర్వహణ పనుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు MPDOలను సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ ఉత్తర్వులు జారీ చేశారు.​ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట MPDO ఏవీ మురళీకృష్ణ, తడ MPDO డీ.శేఖర్ నాయక్‌లను సస్పెండ్ చేశారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన 'స్వచ్ఛ రథాల' ఏర్పాటు, వాటి నిర్వహణలో వీరు అలసత్వం ప్రదర్శించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయడంలో అధికారులు విఫలమయ్యారని కమిషనర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు జరిమానా
Local· 16 Jun 2026

మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు జరిమానా

TG: నాంపల్లికి చెందిన రాకేష్ వర్మ కుమారుడు హైదరాబాద్‌లోని మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ కోర్సులో చేరారు. మొదటి సంవత్సరం ట్యూషన్ ఫీజు కింద రూ.80వేలు చెల్లించారు. పదోతరగతి, ఇంటర్ ఒరిజినల్ సర్టిఫికెట్లను కాలేజీ సిబ్బంది తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో మొదటి సెమిస్టర్ పూర్తయిన తర్వాత విద్యార్థి చదువును ఆపేశాడు. సర్టిఫికెట్లు తిరిగివ్వాలని విద్యార్థి, అతని తండ్రి కాలేజీ చుట్టూ తిరిగారు. అదనంగా రూ.80వేలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని యాజమాన్యం పేర్కొంది. వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించడంతో రూ.1.10 లక్షలను చెల్లించాలని పేర్కొంది.

నో వెహికిల్ చెకింగ్..  ఓన్లీ స్లీపింగ్
Local· 14 Jun 2026

నో వెహికిల్ చెకింగ్.. ఓన్లీ స్లీపింగ్

TG: భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంప‌హాడ్‌ మండలంలోని మోరంపల్లిబంజర్ చెక్‌పోస్ట్‌లో పనిచేస్తున్న గార్డు పట్టపగలే నిద్రపోతున్న విషయం బయటపడింది. చెక్‌పోస్టు పర్యవేక్షణ బాధ్యత చూడాల్సిన FBO అక్కడ లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది గార్డును ఉంచి వెళ్లడంతో ఆ వ్యక్తి డ్యూటీ టైమ్‌లో నిద్రపోతూ కన్పించాడు. నిత్యం వందలాది వాహనాలు ఈ చెక్‌పోస్టు మీదుగా వెళ్తున్నా తనిఖీ చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గార్డు 24 గంటలూ విధులు నిర్వహించాల్సి ఉండ‌గా ఇలా పట్టపగలు నిద్ర పోతున్నాడంటే అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

నో వెహికిల్ చెకింగ్..  ఓన్లీ స్లీపింగ్
Local· 13 Jun 2026

నో వెహికిల్ చెకింగ్.. ఓన్లీ స్లీపింగ్

TG: భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంప‌హాడ్‌ మండలంలోని మోరంపల్లిబంజర్ చెక్‌పోస్ట్‌లో పనిచేస్తున్న గార్డు పట్టపగలే నిద్రపోతున్న విషయం బయటపడింది. చెక్‌పోస్టు పర్యవేక్షణ బాధ్యత చూడాల్సిన FBO అక్కడ లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది గార్డును ఉంచి వెళ్లడంతో ఆ వ్యక్తి డ్యూటీ టైమ్‌లో నిద్రపోతూ కన్పించాడు. నిత్యం వందలాది వాహనాలు ఈ చెక్‌పోస్టు మీదుగా వెళ్తున్నా తనిఖీ చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గార్డు 24 గంటలూ విధులు నిర్వహించాల్సి ఉండ‌గా ఇలా పట్టపగలు నిద్ర పోతున్నాడంటే అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.