వాట్పాప్ గ్రూప్లో పాలిటిక్స్.. పోలీసులకు ఫిర్యాదు

TG: హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్-12లోని NBTనగర్ బస్తీ సమస్యలపై చర్చించుకునేందుకు స్థానికులు ఒక వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. గ్రూప్లో కొందరు పొలిటికల్ మెసెజెస్ పోస్టు చేస్తున్నారు. గ్రూప్లో రాజకీయ పరమైన పోస్టులు పెట్టకూడదని గ్రూప్ అడ్మిన్ హెచ్చరించారు. ఓ మహిళ నిరంతరం పొలిటికల్ మెసెజెస్ పోస్ట్ చేస్తుంది. అడ్మిన్ ఆమెను గ్రూప్ నుంచి రిమూవ్ చేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రూప్ నిబంధనలను ఉల్లంఘించినందుకే ఆమెను తొలగించామని, ఆమెను తిరిగి గ్రూప్లో చేర్చుకునే ప్రసక్తేలేదని అడ్మిన్ పోలీసుల ముందే తేల్చి చెప్పాడు.



