TG· 4 Aug 2026
అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయాలి: ఉత్తమ్
తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి, సీతారామసాగర్, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు త్వరగా సాధించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు, అధికారులతో కలిసి ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆరునెలల్లో అనుమతులు పొందేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు రాష్ట్ర ప్రాజెక్టులకు అనుకూల అవకాశాలు కల్పించిందన్నారు. గతంలో తిరస్కరణకు గురైన ప్రతిపాదనలను సరిదిద్ది మళ్లీ సమర్పించాలని తెలిపారు.