ప్రజలకు మరింత వేగంగా డిజిటల్ సేవలు

తెలంగాణలో ప్రజలకు మరింత మెరుగైన డిజిటల్ సేవలు అందించేందుకు మీ సేవ కేంద్రాలను ఆధునీకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో డిజిటల్ ఇండియా–వికసిత్ భారత్ 2047 లక్ష్యాలపై చర్చించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో కొత్త డేటా సెంటర్ల ఏర్పాటు, కృత్రిమ మేధస్సు (AI), సైబర్ భద్రత, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యువతకు ఐటీ ఆధారిత ఉపాధి అవకాశాల విస్తరణ వంటి అంశాలపై సమీక్షించారు.



